పోస్ట్‌లు

ఫిబ్రవరి, 2024లోని పోస్ట్‌లను చూపుతోంది

106. సంతోషపు కళ్లాలు

చిత్రం
ఒకసారి మధ్య ఆసియా నుంచి ఒక ఆక్రమణదారుడు వచ్చి ఢిల్లీని ఆక్రమించుకుని విజయోత్సవము జరపాలనుకున్నాడు. అందుకు గాను ఒక ఏనుగుని అలంకరించి సిద్ధం చేశారు. దాన్ని అధిరోహించగానే ఏనుగు కళ్లాలు తనకు ఇవ్వమని అతడు అడిగాడు. ఏనుగును మావటి తన అంకుశం ద్వారా నియంత్రిస్తారని తెలుసుకోగానే అతను క్రిందికి దూకి తన గుర్రాన్ని పిలిపించుకొని కళ్లాలు తన చేతిలో లేని దాన్ని తాను అధిరోహించనని అన్నాడు. అలాగే మన సంతోషము , భావోద్వేగాల యొక్క కళ్లాలు మన చేతుల్లో ఉన్నాయా లేక ఇతరుల చేతుల్లో ఉన్నాయా అని మనం ఆత్మవిశ్లేషణ చేసుకోవాలి. వీటి కళ్లాలు మన వద్దే ఉన్నాయని మనం భావిస్తాము కానీ నిజానికి ఈ కళ్లాలు తరచుగా ఇతరుల చేతుల్లో ఉంటాయి. అది ఒక స్నేహితుడు కావచ్చు ; కుటుంబంలో ఎవరైనా కావచ్చు ; సహోద్యోగి కావచ్చు ; వారి మనస్థితి , భావాలు , మాటలు , పొగడ్తలు , విమర్శలు మనల్ని సంతోషానికి లేక బాధకు గురిచేస్తాయి. వీటిలో ఆహారం , పానీయాల వంటి వస్తువులు ; భౌతిక సంపదలు ; అనుకూల , ప్రతికూలమైన పరిస్థితులు ; చివరికి మన గతం , భవిష్యత్తు కూడా ఉండవచ్చు. “ఈ శరీరమును విడువకముందే అనగా జీవించి ఉండగానే కామక్రోధాదుల ఉద్వేగములను అదుపులో ఉంచుకోగల సాధకుడ...

105. అలౌకిక ఆనందం

చిత్రం
“ ప్రియములకు పొంగనివాడు , అప్రియములు ఎదురైనప్పుడు కృంగిపోనివాడు , స్థిరమైన బుద్ధి కలవాడు , మోహవివశుడు కానివాడు పరబ్రహ్మమైన పరమాత్మ యందు సదా ఏకీభావ స్థితియందు ఉండును” ( 5.20). మనం పరిస్థితుల గురించి ఆహ్లాదకరమైనవి , అసహ్యకరమైనవి అని అభిప్రాయాలని ఏర్పరచుకుంటాము ; వ్యక్తుల విషయములోను అదే విధంగా జరుగుతుంది. ఈ విభజనలను , అభిప్రాయాలను తప్పకుండా విడనాడాలి అని శ్రీకృష్ణుడు చెబుతున్నారు ( 2.50). ఏది మనదో , ఏది కాదో అన్న వాస్తవమును తెలిసికొనడంలో చేసే పొరపాటు వలన మనము మోహానికి గురవుతాము. దాని నుంచి బయటపడమని శ్రీకృష్ణుడు అర్జునుడితో పదేపదే చెబుతుంటారు. మన ఇంద్రియాల ద్వారా మనం సుఖాన్ని పొందగలం అనేది అతి పెద్ద భ్రమ. మరొకవైపున శ్రీకృష్ణుడు బాహ్య ఇంద్రియ సుఖాలతో సంగం లేనివారు దివ్యమైన ఆనందాన్ని ' స్వయం ' లోనే పొందుతారని చెబుతూ అలౌకిక ఆనందానికి ఒక మార్గాన్ని చూపిస్తారు. యోగము ద్వారా పరమాత్మలో లీనమైన వారు అనంతమైన ఆనందాన్ని అనుభవిస్తారని శ్రీకృష్ణుడు చెబుతున్నారు ( 5.21). “ విషయేంద్రియ సంయోగము వలన ఉత్పన్నములగు భోగములన్నియును భోగలాలసులకు సుఖములుగా భాసించినను అవి నిస్సందేహముగా దుఃఖ హేతువులే. ఆ...

104. నిష్పాక్షికతను సాధించడం

చిత్రం
“ ఎవరైతే తమ మనస్సు , బుద్ధిని ఆత్మలో స్థిరపరచుకుంటారో వారు జ్ఞాన సాధనతో పాపరహితులై , పునరావృత్తిరహితమైన పరమగతిని పొందుదురు” అని శ్రీకృష్ణుడు బోధిస్తారు ( 5.17). అజ్ఞానంతో జీవించడం చీకట్లో జీవించటం లాంటిది. చీకట్లో మనం తడుముకుంటూ , పడుతూ లేస్తూ మనల్ని మనం గాయపరుచుకుంటాము. తదుపరి స్థాయి కొన్ని వెలుగు రేఖలను అనుభూతి చెందడం లాంటిది. ఇక్కడ మనము క్షణకాలం పాటు అవగాహన పొంది తిరిగి అజ్ఞానంలోకే వెనక్కి జారిపోతారు. చివరి స్థితి సూర్య కాంతి వంటి శాశ్వత కాంతిని పొందడం. ఇక్కడ అవగాహన ఉత్కృష్ట స్థాయిని చేరుకుంటుంది. అక్కడి నుంచి ఇక తిరిగి రావడం అన్నది ఉండదు. ఇటువంటి తిరిగిరాని స్థితిని ' మోక్షం ' అంటారు. ఇది ' నేను ' పొందే స్వేచ్ఛ కాదు ' నేను ' నుంచి స్వేచ్చ. ఎందుకంటే బాధలన్నిటికీ కారణం ఈ ' నేను ' కనుక. " జ్ఞానులు విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుని యందును , గోవు , ఏనుగు , కుక్క మొదలగు వాని యందును , చండాలుని యందును సమదృష్టిని కలిగి యుందురు” అని శ్రీకృష్ణుడు చెబుతారు ( 5.18). ' సమత్వం ' అనేది భగవద్గీతలోని మూల పునాదుల్లో ఒకటి. సమత్వము వలన మనము పునరావృత్త ...