94. నేర్చుకోవడం అనే కళ
జీవితాంతం నేర్చుకోగల , అభ్యసించగల సామర్థ్యం మనుషులకు మాత్రమే దక్కిన వరం. కానీ ఏమి నేర్చుకోవాలి , ఎలా నేర్చుకోవాలి అన్నది కీలక ప్రశ్న. సత్యాన్ని గ్రహించిన జ్ఞానులకు సాష్టాంగ ప్రణామం చేయడం , ప్రశ్నించడం , సేవ చేయడం ద్వారా తత్త్వజ్ఞాన ప్రాప్తి కలుగుతుందని శ్రీకృష్ణుడు సూచించారు (4.34). సాష్టాంగ ప్రణామం అంటే వినమ్రత , వినయం , ఇతరుల దృక్పథాన్ని అర్ధం చేసుకోవడానికి సహనం , విశాల దృక్పథం. ఇది మనం అహంకారాన్ని అధిగమించామనడానికి సూచిక. ప్రశ్నించడం అనేది ఎలక్ట్రానిక్ సర్క్యూట్ లోని ఫీడ్ బ్యాక్ వలయం లాంటిది ; అవగాహన వచ్చే వరకు మనం ఆలోచిస్తున్న వాటిని , చెబుతున్నవాటిని , చేస్తున్నవాటిని అన్నింటినీ ప్రశ్నిస్తూనే ఉండటం. సేవ చేయడం అంటే కరుణామయము అయిన జీవనం. ఆత్మసాక్షాత్కారం పొందినవారు (గురువు) ఎవరు ? వారిని ఎలా కనుగొనడం అనేది తదుపరి ప్రశ్న. శ్రీమద్భాగవతంలో తనకు 24 మంది గురువులు ఉన్నారని చెప్పిన జ్ఞాని యొక్క ఉదంతాన్ని శ్రీకృష్ణుడు వివరిస్తారు. ఆ జ్ఞాని , భూమి నుంచి క్షమను ; పసిబిడ్డ నుంచి అమాయకత్వాన్ని ; గాలి నుంచి నిస్సంగాన్ని ; తేనెటీగల నుంచి నిల్వ చేయడాన్ని నిరోధించే లక్షణాన్ని ; సూర్యుడి న...