పోస్ట్‌లు

అక్టోబర్, 2022లోని పోస్ట్‌లను చూపుతోంది

26. గులాబీ పద్మం కాలేదు

చిత్రం
శ్రీకృష్ణుడు స్వధర్మాన్ని గురించి వివరించి (2.31-2.37) , ఒక క్షత్రియునిగా అది అతని స్వధర్మం కనుక అర్జునుడు యుద్ధం చేసేందుకు సంకోచించకూడదని చెబుతారు (2.31). శాశ్వతమైనది , అవ్యక్తమైనది , అన్నిటా వ్యాపించినది అయిన ' దాన్ని ' గురించి చెబుతూ శ్రీకృష్ణుడు భగవద్గీతను ప్రారంభిస్తారు. దానిని సులభంగా అర్థం చేసుకునేందుకు ఆత్మ అంటారు. ఆ తర్వాత ఆయన స్వధర్మాన్ని గురించి మాట్లాడతారు. ఆఖరికి కర్మ విషయానికి వస్తారు. అంతరాత్మ వైపు ప్రయాణాన్ని మూడు దశలుగా విభజించవచ్చు. మొదటిది మన ప్రస్తుత స్థితి ; రెండవది మన స్వధర్మాన్ని తెలుసుకోవడం ; మూడవది అంతరాత్మను చేరుకోవడం. మన ప్రస్తుత స్థితి మన స్వధర్మం , అనుభవాలు , జ్ఞానం , జ్ఞాపకాలు , ఊహలతో నిండియున్న చంచలమైన మనస్సు యొక్క సమ్మేళనం. ఈ సమ్మేళనము నుండి మనల్ని మనం విడిపించుకున్నప్పుడు స్వధర్మము నెమ్మదిగా స్పష్టమవుతుంది. క్షత్రియ అన్న పదంలో ' క్షత్ ' అంటే ' గాయము '; ' త్రయ ' అంటే ' రక్షణ ఇవ్వడం '. గాయాల నుంచి మనకు రక్షణనిచ్చేవాడే క్షత్రియుడు. గర్భంలో ఉన్నప్పటి నుండి పిల్లలు తమ కాళ్ళమీద తాము నిలబడే దాకా సంరక్షించే తల్లి...

25. అహంకారం నశించినప్పుడు గమ్యం చేరుకుంటాం

చిత్రం
“ కొందరు ' దీనిని ' ( ఆత్మని) అద్భుతంగా చూస్తారు , మరికొందరు ' దీనిని ' ఒక అద్భుతమని చెబుతారు , మరికొందరు ' దీనిని ' అద్భుతమని వింటారు ; అయినప్పటికీ ఇదేమిటన్నది ఎవరికీ తెలియదు ” అని శ్రీకృష్ణుడు చెబుతున్నారు (2.29). ‘ ఎవరికీ ' అనే పదం , ఆత్మను అర్థం చేసుకోవడానికి తన ఇంద్రియాలను ఉపయోగించే పరిశీలకుడిని సూచిస్తుంది. ఈ రెండింటికీ మధ్య విభజన ఉన్నంత వరకు ఒక పరిశీలకుడు ఆత్మను గ్రహించలేడని శ్రీకృష్ణుడు అంటారు. ఒకసారి ఉప్పుతో చేసిన ఒక బొమ్మ సముద్రాన్ని శోధించాలని బయలుదేరింది. ఉపరితలంలోని అలలను దాటి అది సముద్రంలోతుకి వెళ్లి నెమ్మదిగా కరిగిపోవడం మొదలు పెడుతుంది. సముద్రగర్భాన్ని చేరుకొనే లోపల అది పూర్తిగా కరిగిపోయి సముద్రంలో భాగమైపోతుంది. అంటే అదే సముద్రంగా మారిపోయిందని , ఉప్పు బొమ్మకు ఇక వేరే ఉనికి లేదని అనవచ్చు. పరిశీలకుడే (ఉప్పు బొమ్మ) పరికించేది (సముద్రం) గా మారినప్పుడు విభజనలు అంతమై ఐక్యత సాధించబడుతుంది. ఈ ఉప్పు బొమ్మ మన అహంకారం (అహం కర్త ; నేనే కర్తని) వంటిది. ఇది మన ఆస్తులు , ఆలోచనలు , చర్యల ద్వారా ఎల్లప్పుడూ మనల్ని సత్యం నుంచి దూరంగా ఉంచడానికి ప్రయత్నిస్త...

24. ఆత్మ దేహాలను మారుస్తుంది

చిత్రం
ఆత్మ చంపదు లేక చంపబడదు ; అజ్ఞానులు మాత్రమే ఇందుకు భిన్నంగా ఆలోచిస్తారని శ్రీకృష్ణుడు అంటారు. అది పుట్టుక లేనిది , శాశ్వతమైనది , మార్పులేనిది , పురాతనమైనది. మనం చివికిపోయిన , పాతవి అయిన వస్త్రాలను వదిలివేసి కొత్తవి ధరించినట్లుగా ఆత్మ భౌతిక దేహాలను మారుస్తుందని ఆయన అంటారు (2.19 , 2.20). సాంకేతిక పరిభాషలో దీన్ని శక్తి పరిరక్షణ సూత్రం ( law of conservation of energy), ద్రవ్యరాశి , శక్తి యొక్క పరస్పర మార్పిడి సూత్రం ( principle of inter-convertibility of mass and energy) ద్వారా బాగా అర్ధం చేసుకోవచ్చు. ఆత్మను శక్తితో పోలిస్తే శ్రీకృష్ణ భగవానుని బోధనలు స్పష్టమవుతాయి. శక్తి పరిరక్షణ సూత్రం ప్రకారం శక్తిని సృష్టించలేము , నాశనం చేయలేము కానీ ఒక రూపం నుంచి మరొక రూపానికి మార్చగలం. ఉదాహరణకు ఉష్ణశక్తి స్థానాలు (థర్మల్ పవర్ స్టేషన్లు) ఉష్ణశక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తాయి. ఒక బల్బు విద్యుత్ శక్తిని కాంతిగా మారుస్తుంది. కాబట్టి ఇక్కడ కేవలం శక్తి మార్పిడి జరుగుతోంది కానీ నాశనము కాదు. బల్బు జీవితం పరిమితకాలం. ఇది కాలిపోతే కొత్త బల్బును పెడతాము కానీ విద్యుత్తు అలాగే ఉంటుంది. ఇది జీర్ణమైన వస్త్రాలను...

23. ఆత్మ అవ్యక్తమైనది

చిత్రం
శ్రీకృష్ణుడు అర్జునుడితో “ఇది” (దేహి/ఆత్మ) అవ్యక్తమైనది , అనూహ్యమైనది , వికారరహిత మైనదని చెప్పి , ఒకసారి దీని గురించి తెలుసుకుంటే భౌతిక శరీరం కోసం దుఃఖించ వలసిన అవసరం లేదని అంటారు (2.25). పుట్టుకకు ముందు అన్ని జీవులు అవ్యక్తంగా ఉంటాయని , పుట్టుకకు చావుకు మధ్య మాత్రమే వ్యక్తమవుతాయని , తిరిగి మరణించాక అవ్యక్త (అదృశ్య) మవుతాయని శ్రీకృష్ణుడు బోధిస్తున్నారు (2.28). అనేక సంస్కృతులు దీనిని వివరించడానికి సముద్రము , అలల ఉదాహరణను ఇస్తాయి. సముద్రం అవ్యక్తాన్ని సూచిస్తే , అల వ్యక్తాన్ని సూచిస్తుంది. సముద్రం నుంచి అనేక పరిమాణాలు , ఆకారాలు , తీవ్రతలతో కొంత కాలానికి మాత్రమే ఈ అలలు వ్యక్తమవుతాయి. చివరికి అలలు అవి పుట్టిన సముద్రంలోనే కలిసిపోతాయి. వ్యక్తమయ్యే అలలను మాత్రమే ఇంద్రియాలు గ్రహించగలవు. అలాగే ఒక విత్తనానికి చెట్టుగా వికసించే సామర్థ్యం ఉంటుంది. విత్తనంలో చెట్టు అవ్యక్త రూపంలో దాగి ఉంటుంది. విత్తనము నుండి మొలక రావడం మొదలవగానే చెట్టు వ్యక్తమవుతుంది. ఆ చెట్టు అనేక విత్తనాలను ఉత్పత్తి చేసి మరణిస్తుంది. ఇంద్రియాలు తమ పరిమితమైన సామర్థ్యంతో తెలుసుకోగల వాటిని ' వ్యక్తము ' అంటాము. ఆధునిక ...

22. సంతులనమే పరమానందం

చిత్రం
విషయేంద్రియ సంయోగము వలన శీతోష్ణములు , సుఖదుఃఖములు కలుగుచున్నవి . అవి అనిత్యములు కనుక వాటిని సహింపమని భగవద్గీత ప్రారంభంలోనే శ్రీకృష్ణుడు చెబుతారు (2.14). సమకాలీన సమాజంలో దీనిని ' ఇది కూడా గతించిపోతుంది ' అని వ్యక్తీకరిస్తారు. అనుభవాత్మక మైన స్థాయిలో మనం దీనిని అలవర్చుకోగలిగితే ఈ ద్వంద్వాలను అధిగమించి వాటిని సమానంగా స్వీకరించడం అలవర్చుకుంటాము. మనకు చూపు , వినికిడి , వాసన , రుచి , స్పర్శ అనే ఐదు ఇంద్రియానుభూతులు ఉన్నాయి. వాటిని వ్యక్తీకరించే భౌతిక సాధనాలు కళ్ళు , చెవులు , ముక్కు నాలుక , చర్మం. సంబంధిత ఇంద్రియాల ద్వారా వచ్చే సమాచారాన్ని క్రమబద్దీకరించడానికి మెదడులో ఒకో ఇంద్రియానికి ఒకో ఒక భాగం ఉంటుంది. ఇంద్రియ సాధనాలకి అనేక పరిమితులు ఉన్నాయి. ఉదాహరణకి కన్ను ఒక రకమైన పౌనఃపుణ్యం (frequency) గల కాంతిని మాత్రమే క్రమబద్ధం చేయగలదు. దీన్నే మనం దృశ్యమాన కాంతి ( visible light) అంటాము. రెండవది అదీ సెకనుకి 15 కన్న ఎక్కువు చిత్రములు గుర్తించలేదు. తెరపై చూసినప్పుడు మనకి ఆనందాన్ని ఇచ్చే వీడియోలు , సినిమాల సృష్టి వెనక ఉన్న సూత్రం ఇదే. మూడవది , ఏదైనా దృశ్యమును చూడడానికి కనీసం కొంత కాంతైనా క...

21. సృజనాత్మకతను నాశనము చేయలేము

చిత్రం
అంతరాత్మను అర్థం చేసుకునే తృష్ణతో ఉన్న మానవాళికి రెండు రకాల జ్ఞానులు మార్గదర్శకత్వం చేశారు. రెండు మార్గాల గమ్యం ఒకటే అయినప్పటికీ ఒకరు సానుకూల పక్షం నుంచి , మరొకరు ప్రతికూల పక్షం నుంచి ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఆరంభించే స్థలం మరియు మార్గము వేర్వేరుగా ఉండవచ్చు. ఏ మార్గంలో వెళ్తాము అన్నది మన స్వభావం పై ఆధారపడి ఉంటుంది. సానుకూల దృక్పథంతో సాగే మార్గదర్శనము నాశనము లేనిది , శాశ్వతమైనది , స్థిరమైనది , సర్వత్రా వ్యాపించి ఉన్న ' దాన్ని ', దానికి ' ఇంకేమి కలపలేని ' సంపూర్ణముగా వర్ణిస్తుంది. ' సృజనాత్మకత ' దీనికి రూపకం. ప్రతికూల దృక్పధంతో సాగే మార్గదర్శనము నాశనం చేయలేనిది , స్థిరమైనది , శాశ్వతమైనది , సర్వత్రా వ్యాపించి ఉన్న ' దాన్ని ', దాని నుండి ' ఇంకేమి తీయలేని ' ఖాళీగా వర్ణిస్తుంది. ' శూన్యం ' దీనికి రూపకం. ' సృజనాత్మకత ', ' శూన్యం ' అనేవి రెండూ సృష్టికరణ , భౌతిక వ్యక్తీకరణల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ' సృజనాత్మకత ' సృష్టికి దారి తీస్తుందని అర్థం చేసుకోవడం సులభం. మరొకవైపు విజ్ఞాన శాస్త్రం ఈ సమస్త సృష్టి ' శూన్య...