111. మనతో మన స్నేహం
"మనుజులు ఈ సంసారసాగరమునుండి తమను తామే ఉద్ధరించుకోనవలెను. తమకుతామే అధోగతి పాలు కారాదు. ఏలనన లోకములో వాస్తవముగ తమకు తామే మిత్రులు , తమకు తామే శత్రువులు” (6.5) అని శ్రీకృష్ణుడు అంటారు. స్నేహం లాగే ఈ అస్తిత్వగత శ్లోకానికి విభిన్న వ్యాఖ్యానాలు సంభవం అవుతాయి. మొదటిది , ఇది ప్రతి వ్యక్తికి తమను తాము ఉద్ధరించుకొనే బాధ్యత వారి మీదే ఉందని చెబుతుంది. కుటుంబం , స్నేహితులు , సహోద్యోగులు , పరిస్థితులు , దేశం మొదలైన వారిని మన వైఫల్యానికి నిందించే ధోరణి మన అందరికి ఉంటుంది. అదేవిధంగా కర్మలు నుండి ఆశించిన కర్మఫలం పొందనప్పుడు లేదా చెడుగా చిహ్నించబడ్డ కర్మలు చేసినప్పుడు మనము మనల్ని నిందించుకుంటూ ఉంటాము. ఫలితంగా జీవితాంతం ఇతరులపై కక్ష తీర్చుకోవడంలో నిమగ్నమై ఉంటాము లేదా మనల్ని మనం శిక్షించుకుంటూ ఉంటాము. పరిస్థితులు ఏమైనప్పటికీ ఈ శ్లోకం మనల్ని మనం ఉద్ధరించుకోవాలని చెబుతుంది. సాష్టాంగ ప్రణామం , ప్రశ్నించడం మరియు సేవ అనే మూడు గుణాలను మనం పెంపొందించుకున్నప్పుడు గురువు మనకు సహాయం చేస్తారని శ్రీకృష్ణుడు అంతకుముందు హామీ ఇచ్చియున్నారు (3.34). రెండవది , ఇది మన పరిపక్వత , అపరిపక్వతలను స్వీకరించి మన పశ్చాతా...