పోస్ట్‌లు

జులై, 2022లోని పోస్ట్‌లను చూపుతోంది

5. జ్ఞాన, కర్మ, భక్తి యోగాలు

చిత్రం
      వివిధ వ్యక్తులకు వారి దృక్కోణాన్ని బట్టి భగవద్గీత భిన్నంగా కనిపిస్తుంది. ఆత్మజ్ఞానము పొందడానికి భగవద్గీత మూడు మార్గాలను ఉపదేశిస్తుంది - కర్మయోగము , సాంఖ్యయోగము మరియు భక్తియోగము. కర్మయోగము మనస్సు ఆధారితమైన వారికి అనువైనది. సాంఖ్యయోగము బుద్ధిపై , భక్తియోగము హృదయం పై ఆధారపడే వారికి అనుకూలమైనవి. నేటి ప్రపంచంలో అత్యధిక శాతం మనస్సు మీద ఆధారపడే వర్గానికి చెందుతారు. మనమేవో సంకెళ్ళతో బంధింపబడ్డామనీ , వాటిని తెంచుకునేందుకు చాలా కష్టపడి పని చేయాలన్న నమ్మకంపై ఆధారపడి ఇది పనుల దిశగా ప్రేరేపిస్తుంది. వీరితో ఏ విధమైన సంభాషణైనా ' ఇప్పుడు నేను ఏమి చేయాలి ' అన్న అంశంతో ముగుస్తుంది. ఈ దారి మనల్ని నిష్కామకర్మ , అంటే కోరికలు లేని , ఫలితము ఆశించని కర్మల వైపు నడిపిస్తుంది. సాంఖ్యయోగాన్ని జ్ఞానయోగం అని కూడా అంటారు. ఇక్కడ జ్ఞానం అంటే మనం సాధారణంగా ఉపయోగించే విజ్ఞానం కాదు ; ఇది కేవలం అవగాహన లేదా తెలుసుకోగలిగే సామర్థ్యం గురించి మాత్రమే. మనమేదో చీకటిగదిలో ఉన్నామని , ఏమి చేసినా కూడా ఈ అంధకారం పోదు గనక దాన్ని పారద్రోలడానికి ఒక దీపాన్ని వెలిగించాల్సిన అవసరం ఉంది అనేది దీని ఆరంభ బిందువు....

4. మనస్సు ఆడించే ఆటలు

చిత్రం
మన లోపలి వెలుపలి ప్రపంచాలకు ఇంద్రియాలు ద్వారాల వంటివి. అందుకే భగవద్గీత ఇంద్రియాలను అర్థం చేసుకుని వాటిని నియంత్రించమని బోధిస్తుంది. “ఒకటిగా పనిచేసే నాడీకణాలు (న్యూరాన్లు) ఒక్కటిగానే ముడిపడి ఉంటాయని” నాడీ శాస్త్రం ప్రతిపాదిస్తుంది. దీనినే ‘ హార్డ్ వైరింగ్ ’ అంటారు. భగవద్గీతలోని వాక్యాలు కూడా , ఆ కాలపు భాషలని ఉపయోగించి ఇదే సందేశాన్ని ఇస్తాయి. మన మెదడులో సుమారు 100 బిలియన్ న్యూరాన్లు ఉన్నాయి. కొన్ని మన డిఎన్ఏ ( DNA) కారణంగా ముడిపడి , గుండె కొట్టుకోవడం లాంటి   కొన్నిఅసంకల్పితంగా జరిగే ప్రాథమిక దేహ క్రియల కోసం ఉపయోగించబడతాయి. మరికొన్ని మన జీవితకాలంలో మనం చేసే కర్మల ద్వారా కలపబడతాయి. మొదటి రోజు డ్రైవింగ్ వీల్ ముందు కూర్చున్నప్పుడు మనకు కారు నడపడం కష్టంగా అనిపిస్తుంది. తర్వాత నెమ్మదిగా మనం దానికి అలవాటు పడతాము. ఎందుకంటే , అప్పటివరకు వాడుకలో లేని న్యూరాన్లను మన మెదడు హార్డ్ వైరింగ్ ద్వారా జోడించి డ్రైవింగ్ కు సంబంధించిన అన్ని చర్యలను సులభం చేస్తుంది. ఈ ప్రక్రియకు సమయం పడుతుంది. అన్ని రకాల నైపుణ్యాల విషయంలో కూడా ఇదే జరుగుతుంది. నడక నుంచి ఆటల దాకా , ఒక సర్జన్ జరిపే క్లిష్టమైన శస్త్ర...

3. వర్తమానంలో జీవించడం

చిత్రం
‘ మనం ఎవరమో ’ భగవద్గీత చెబుతుంది . ఇది సత్యాన్ని గురించి తెలిసుకొనటమే కాకుండా , సత్యవంతులై ఉండటం వంటిది. మనం వర్తమానంలో జీవించినప్పుడే ఇది సాధ్యమౌతుంది. ఒకవేళ తన మిత్రులను , బంధువులను , పెద్దలను , గురువులను రాజ్యం కోసం చంపితే , ప్రపంచం దృష్టిలో తన ప్రతిష్ట నాశనము అవుతుందని అని అర్జునుడు భావిస్తున్నాడు . ఇది చాలా తార్కికంగా కనబడుతుంది. భగవద్గీత చెప్పిన ప్రకారం జీవించాలంటే  ఇలాంటి సందిగ్ధాలను అధిగమించాలి. అర్జునుడి అసలైన సందిగ్ధం అతని భవిష్యత్తు గురించి. శ్రీకృష్ణుడు మనకు కర్మ చేసే హక్కు ఉంది కానీ కర్మఫలంపై అధికారము లేదని బోధిస్తారు ఎందుకంటే కర్మ వర్తమానంలో జరుగుతుంది కానీ కర్మఫలం అనేది భవిష్యత్తులో వస్తుంది. అర్జునుడి లాగానే మనము కూడా కర్మఫలాలను ఆశించి అనేక కర్మలు చేస్తూ ఉంటాము. ఆధునిక జీవనం కొన్నిసార్లు మనం భవిష్య పరిణామాలను నియంత్రించగలమన్న భావనను కలిగిస్తుంది. కానీ భవిష్యత్తు అనేది మన చేతుల్లో లేని అనేక సంభావనల కలయిక. మన అహంకారమే గతంపై ఆధారపడి , వర్తమానంలో భవిష్యత్తును చూపిస్తూ ఇటువంటి సందిగ్దాలను సృష్టిస్తుంది. దీనివల్ల మనం వర్తమానంలో జీవించలేని పరిస్థితి ఏర్పడుతుంది. అం...

2.జీవితంలోని వైరుధ్యాలు

చిత్రం
“ అన్ని మార్గాలు ఒకే గమ్యానికి చేరతాయి ” అన్నట్లుగా భగవద్గీతలో ఇవ్వబడిన అన్ని మార్గాలు మనల్ని ఆత్మజ్ఞానం వైపుకి నడిపిస్తాయి. కొన్ని మార్గాలు ఒకదానికొకటి విరుద్ధంగా ఉన్నట్లుగా అనిపిస్తాయి. కానీ ఇదంతా ఒక వలయాకారం లాంటిది. ఏ మార్గములో ప్రయాణించినా కూడా ఒకే గమ్యానికి మనల్ని తీసుకుని వెళ్తాయి. గీతోపదేశము వివిధ స్థాయిల్లో ఉన్నదన్న విషయాన్ని మనము ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. కొన్నిసార్లు శ్రీకృష్ణుడు అర్జునుడి స్థాయికి వచ్చి బోధిస్తారు. కొన్నిసార్లు ఆయన పరమాత్మగా ప్రకటితమవుతారు. ప్రాథమిక దశలో ఈ రెండు స్థాయిలూ వేరువేరుగా కనిపిస్తాయి కనుక అర్థం చేసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. గత శతాబ్దం ప్రారంభములో కాంతిని అర్థం చేసుకునేటప్పుడు శాస్త్రవేత్తలు కూడా ఇటువంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు. మొదట కాంతికి తరంగ స్వభావం ఉందని నిరూపించారు. తర్వాత అది కణంలా ప్రవర్తిస్తుందని గుర్తించబడింది. ఈ రెండు సిద్ధాంతాలు ఒకదానికొకటి విరుద్ధం అయినప్పటికీ మనం ప్రతి క్షణం చూసే వెలుగు స్పష్టమైన వైరుధ్యాల కలయిక. జీవితం కూడా అలాంటిదే . ఒకసారి ఒక ఏనుగు గ్రామంలోకి ప్రవేశించింది. కొంతమంది అంధులు దాన్ని గురించి తెలుసు...

1. అహంకారంతో ఆరంభం

చిత్రం
  శ్రీకృష్ణ భగవానుడికి , యోధుడైన అర్జునుడికి కురుక్షేత్ర యుద్ధ క్షేత్రంలో జరిగిన 700 శ్లోకాల సంభాషణే ' భగవద్గీత ' . యుద్ధంలో తన బంధుమిత్రులు ఎంతో మంది చనిపోతారన్న భావన కలిగి , ఇది మంచిది కాదని అర్జునుడు వాదిస్తాడు. ' నేను కర్తని '- అహం (నేను) కర్త (చేసేవాడిని) , అంటే అహంకారమనే భావనలో నుంచే అర్జునుని సందిగ్ధత జన్మించింది. ఈ అహంకారం మనం ప్రత్యేకమని చెబుతుంది కానీ వాస్తవం ఇందుకు పూర్తిగా భిన్నమైనది. మామూలుగా గర్వాన్ని అహంకారానికి అర్థంగా అనుకొంటునప్పటికీ , అహంకారం యొక్క అనేక రూపాల్లో గర్వం ఒకటిగా భావించవచ్చు. భగవద్గీత మొత్తంలో , శ్రీకృష్ణుడు ఈ అహంకారాన్ని గురించి చెబుతూ , దాన్ని నిర్మూలించడానికి అవసరమైన మార్గాలను , ఈ మార్గాలలో మన ప్రగతిని అంచనా వేసుకోటానికి కావలసిన మైలురాళ్లను (కొలబద్దల) గురించి బోధిస్తారు. కురుక్షేత్ర యుద్ధరంగాన్ని పోలిన పరిస్థితులు మనందరి జీవితాల్లోనూ తరచూ ఎదురవుతాయి. అర్జునుడికి ఎదురైన సందేహాలు మన కుటుంబాల నేపథ్యంలోగానీ , పని చేసే చోట్ల కానీ , ఆరోగ్యం లేదా లాభనష్టాల విషయంలో కానీ ; సంబంధాలు , బంధుత్వాలు విషయంలో కానీ మనందరికీ ఎదురయ్యేవే. మనం బతి...