పోస్ట్‌లు

ఫిబ్రవరి, 2023లోని పోస్ట్‌లను చూపుతోంది

49. స్థితప్రజ్ఞత అనేది అంతర్గత ఘటన

చిత్రం
శ్రీకృష్ణుడు అర్జునుడి ప్రశ్నకు సమాధానంగా స్థితప్రజ్ఞుడు తన పట్ల తాను సంతృప్తితో ఉంటాడని చెప్పారు (2.55) . స్థితప్రజ్ఞత గలవారు ఎలా మాట్లాడుతారు , కూర్చుంటారు , నడుస్తారు అనే అర్జునుడి ప్రశ్న యొక్క రెండవ భాగానికి శ్రీకృష్ణుడు స్పందించలేదు. ' స్వయంతో సంతుష్టి ' అనేది అంతర్గత ఘటన. బాహ్య ప్రవర్తన ఆధారంగా దీనిని కొలవలేము. కొన్ని పరిస్థితులలో ఒక అజ్ఞాని , స్థితప్రజ్ఞుడు ఒకే మాటలు మాట్లాడవచ్చు , అదే పద్ధతిలో కూర్చోవచ్చు , నడవచ్చు. ఇది స్థితప్రజ్ఞతను గురించి మన అవగాహనను మరింత క్లిష్టతరం చేస్తుంది. శ్రీకృష్ణుని జీవితం స్థితప్రజ్ఞుని జీవితానికి ఉత్తమ ఉదాహరణ. ఆయన పుట్టుకతోనే తల్లిదండ్రుల నుండి విడిపోయారు. ఆయన్ను ' వెన్న దొంగ ' అని పిలిచేవారు. ఆయన శృంగారం , నృత్యం , వేణువు పౌరాణికమైనవి కానీ ఆయన బృందావనం విడిచి పెట్టాక శృంగారాన్ని కోరుతూ తిరిగి రాలేదు. ఆయన అవసరమైనప్పుడు యుద్ధం చేసి శత్రువులను చంపారు. కానీ కొన్ని సమయాల్లో యుద్ధానికి దూరంగా ఉన్నారు. అందుకే ' యుద్ధం నుండి పారిపోయే వ్యక్తి ' అని పిలువబడ్డారు. అయన ఎన్నో అద్భుతాలు చేసారు , స్నేహితులకు స్నేహితుడు కూడాను. వివాహ...

48. 'స్వయం'తో సంతృప్తి

చిత్రం
  శ్రీకృష్ణ భగవానుడు శ్లోకము 2.11 నుంచి శ్లోకము 2.53 వరకు సాంఖ్యయోగం అంటే ఏమిటో వెల్లడించారు. ఇది అర్జునుడికి కొత్త విషయం. అర్జునుడు సమాధిని సాధించిన స్థితప్రజ్ఞ పురుషులు ఎలా మాట్లాడుతారో , కూర్చుంటారో , నడుస్తారో తెలుసుకోవాలనుకున్నాడు (2.54) . అర్జునుడికిచ్చే వివరణల ద్వారా , శ్రీకృష్ణుడు , మన చంచల మనస్సుని అదుపులో పెట్టడానికి కొలమానాలను నిర్ధారించారు. వీటిని ఉపయోగించుకొని ఆధ్యాత్మిక ప్రయాణంలోని మన పురోగతిని స్వయంగా కొలుచుకోవచ్చు. శ్రీకృష్ణుడు ఇలా చెప్పారు , “ మనస్సు నందలి కోరికలన్నియును పూర్తిగా తొలగిపోయి , ఆత్మద్వారా ఆత్మయందు సంతుష్టుడై , ఆత్మానందమును పొందినవానిని స్థితప్రజ్ఞుడని యందురు” (2.55). ఒక వ్యక్తి తనపట్ల తాను సంతృప్తి చెందినప్పుడు కోరికలు వాటంతటవే నశించిపోతాయి. కోరికలు లేని ఆ స్థితిలో వారు చేసే చర్యలన్నీ నిష్కామ కర్మలు అవుతాయి. ఉన్నదానికంటే భిన్నంగా ఉండాలనేది మన ప్రాథమిక కోరిక. మనకున్న ప్రస్తుత పరిస్థితితో మనం చాలా త్వరగా విసుగు చెందుతాము. ఈ స్థితిని అర్థశాస్త్రంలో ' తీరిన కోరిక మనల్ని ప్రేరేపించదు ' అని అంటారు. ఈ విషయాన్ని మనమందరము ఇతరులపై ఒక వ్యూహంగా ఉపయోగిస్తాము....

47. స్థిరమైన బుద్ధి

చిత్రం
మన జీవిత గమనంలో ఒకే విషయం పై విరుద్ధమైన అభిప్రాయాలను విన్నప్పుడు మనం కలవరపడతాము . ఇవి వార్తలు , తత్వశాస్త్రం , ఇతరుల అనుభవాలు , నమ్మకాలు ఏమైనా కావచ్చు. వివిధ అభిప్రాయాలను విన్నప్పటికీ మన బుద్ధి నిశ్చలంగా (చలించకుండా) , సమాధిలో స్థిరంగా ఉన్నప్పుడు మనం యోగాన్ని పొందుతామని శ్రీకృష్ణుడు బోధిస్తున్నారు (2.53). ఈ శ్లోకాన్ని అర్థం చేసుకోవడానికి చెట్టు సరైన ఉదాహరణ. దాని పైభాగం కనిపిస్తుంది ; క్రింది భాగం వేళ్ల మూల వ్యవస్థతో కూడి అదృశ్యంగా ఉంటుంది. పైభాగం గాలుల బలానికి ఊగుతుంది , కానీ ఈ గాలుల వల్ల వేళ్ల వ్యవస్థ ప్రభావితం కాదు. పైభాగం బాహ్య శక్తులకు ఊగిసలాడుతున్నప్పుడు క్రింది భాగం సమాధి స్థితిలో నిశ్చలంగా , స్థిరంగా ఉండడంతో పాటు పోషకాహారాన్ని అందించే తన బాధ్యతను నిర్వహిస్తుంది. బాహ్యభాగం ఊగిసలాడుతున్నప్పటికీ అంతర్గతంగా నిశ్చలంగా ఉండటమే చెట్టుకు యోగస్థితి. అజ్ఞాన స్థాయిలో మనకున్న చంచల బుద్ధి బాహ్య ఉత్తేజనలకు ప్రభావితమై దానంతటదే ఊగిసలాడుతుంది. ఈ ఉగిసలాట తాత్కాలిక స్పందనలు , ఉద్వేగాలు , కోపాలతో కూడిన మన ప్రవర్తన ద్వారా జీవితాలను సమస్యాత్మకం చేస్తాయి. మన వ్యక్తిగత జీవితాలనే కాక మన కుటుంబ సభ్యు...

46. ఏది మనది, ఏది కాదు?

చిత్రం
  “ మోహమనెడి ఊబినుండి పూర్తిగా బయటబడినప్పుడే నీవు వినిన , వినబోవు ఇహపరలోక సంబంధమైన సమస్త భోగములనుండి వైరాగ్యము (నిర్వేదం) ను పొందగలవు” అని శ్రీకృష్ణుడు చెప్పారు ( 2.52). మనం మోహాన్ని అధిగమించినప్పుడు మన ఇంద్రియాల ద్వారా వచ్చే సమాచారం మనను తన ఇష్టానుసారంగా ప్రభావితం చేసే శక్తిని కోల్పోతుంది. శ్రీకృష్ణుడు ' వినికిడి ' ని ఉదాహరణగా ఎంచుకున్నారు ఎందుకంటే మనం తరచుగా ప్రశంసలు , విమర్శలూ , చాడీలు , పుకార్లు వంటి ఇతరుల మాటలచే ప్రభావితమవుతాము. పదాల కొరత కారణంగా , అహంకారం లాగే మోహమును వర్ణించడం కష్టం. ఏది మనది , ఏది కాదు అనే వాటి మధ్య తేడాను గుర్తించలేకపోవడమే మోహం. అంటే వర్తమానంలో , భవిష్యత్తులో భౌతిక ఆస్తులు మీద యాజమాన్య భావన. వాస్తవానికి మనం వీటికి యజమానులం కాము. మనం మనది కాని దానిని అంటిపెట్టుకుని ఉండటానికి ప్రయత్నిస్తున్నప్పుడు మనదైన ఆత్మను మనము గుర్తు పట్టలేక పోతాము. శ్రీకృష్ణుడు ఈ దృగ్విషయాన్ని ' కలిలం ' లేదా ఆధ్యాత్మిక చీకటి అని పిలుస్తారు. ఈ అంధకారాన్ని అధిగమించినప్పుడు మనం ' వైరాగ్యము ' ( నిర్వేదం) ను పొందుతామని శ్రీకృష్ణుడు చెప్పారు. నిర్వేదం ఉదాసీనతగా వర్ణిం...

45. జన్మ మృత్యువులనే భ్రాంతిలో కలిగే బంధాలు

చిత్రం
  “ సమబుద్ధియుక్తులైన జ్ఞానులు కర్మఫలములను త్యజించి , జనన మరణ బంధముల నుండి ముక్తులయ్యెదరు. అంతేగాక , వారు నిర్వికారమైన పరమపదమును పొందుదురు” అని శ్రీకృష్ణుడు చెబుతున్నారు ( 2.51). నిశ్చలమైన భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడని దీర్ఘకాలంగా మానవాళి నమ్మింది. కానీ సూర్యుని చుట్టూ భూమి తిరుగుతున్నదని తరువాత కనుగొనబడింది. అంటే మన అవగాహన అస్తిత్వగత సత్యంతో మేళవించింది. మన ఇంద్రియాల పరిమితుల వల్ల కలిగే భ్రమతో సత్యాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల ఈ సమస్య ఏర్పడిందని తెలుస్తుంది. జననం , మరణం గురించిన మన భ్రమ కూడా ఇటువంటిదే. శ్రీకృష్ణుడు ' దేహి ' లేక ఆత్మను గురించి వివరిస్తూ భగవద్గీతను ప్రారంభించారు . అది అన్నింటిలోనూ వ్యాపించినది , జన్మలేనిది , శాశ్వతమైనది , పురాతనమైనది ( 2.20). కొత్త వస్త్రాలను ధరించడానికి మనం జీర్ణమైన వాటిని విడిచినట్లుగా ఆత్మ భౌతిక శరీరాలను మారుస్తుందని ఆయన చెప్పారు ( 2.22). సమబుద్ధితో జన్మ బంధాల నుండి విముక్తి పొందుతారని ఆయన చెప్పినప్పుడు , వారు ' దేహి , ఆత్మ ' అనే అస్తిత్వగత సత్యంతో తమను తాము జోడించుకోవడాన్ని సూచిస్తుంది. ఇది భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్...

44. సంతులిత నిర్ణయాలు తీసుకోవడం

చిత్రం
  మనమందరం వివిధ అంశాల ఆధారంగా మన కోసం , మన కుటుంబం , సమాజం కోసం అనేక నిర్ణయాలు తీసుకుంటాము. ఈ నిర్ణయ సామర్థ్యాన్ని తదుపరి స్థాయికి తీసుకువెళ్లమని చెబుతూ , ' యోగః కర్మసు కౌశలం ', అంటే యోగస్థితిలో చేసే ప్రతి కర్మ సామరస్యంగా ఉంటుందని శ్రీకృష్ణుడు ఉద్బోధించారు (2.50). ఇది పువ్వు యొక్క అందం , వెలువడే సువాసన వంటి సామరస్యాన్ని అనుభవించడానికి కర్తృత్వాన్ని , అహంకారాన్ని వదిలివేయడం. మన నిర్ణయాలన్నీ మనకు మరియు మన కుటుంబానికి సుఖాన్ని పొందడం లేదా దుఃఖాన్ని నివారించడం కోసం తీసుకుంటాము. తదుపరి స్థాయిలో మనము సమతుల్య నిర్ణయాలు తీసుకుంటాము , ప్రత్యేకించి మనం సంస్థలకు , సమాజానికి బాధ్యత వహిస్తున్నప్పుడు కానీ ఈ స్థాయిలో కర్తృత్వం ఇంకా మిగిలి ఉంటుంది. శ్రీకృష్ణుడు కర్తృత్వానికి తావులేని అంతిమ స్థాయి గురించి మాట్లాడుతున్నారు. అటువంటి స్థాయికి చేరిన వ్యక్తి ఏది చేసినా అది సామరస్యంగా ఉంటుంది. అంతటా వ్యాపించిన చైతన్యమే వారికి కర్తగా మారుతుంది. తమ బాధ్యతలను నిర్వహించడానికి ఈ దశ నిర్ణయాధికారులందరికీ అనివార్యమైనది. కనుకనే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ( IAS - భారతీయ పరిపాలనా సేవ) ' యోగః కర్మసు ...

43. తటస్థంగా ఉండడం

చిత్రం
  మన యొక్క , ఇతరుల యొక్క పనులు , నిర్ణయాలు , మంచివి లేదా చెడ్డవనే విభజనలు చుట్టూ మనం జీవితాలను గడుపుతాము. "సమత్వబుద్ధి యుక్తుడైనవాడు పుణ్యపాపములను రెండింటిని ఈ లోకమునందే త్యజించును” అని శ్రీకృష్ణుడు చెప్పారు (2.50). అంటే ఒకసారి మనము ఈ సమత్వయోగాన్ని చేరుకున్న తర్వాత ఈ విభజనలను వదిలేస్తాము . అభిప్రాయాలకు తావు ఇవ్వము. మన మనస్సు అనేక రంగుటద్దాలతో కప్పబడి ఉంటుంది. ఎదిగే సమయంలో మన తల్లిదండ్రులు , కుటుంబ సభ్యులు , స్నేహితుల నియంత్రణ ద్వారా అలాగే మనముంటున్న దేశం యొక్క చట్టం ద్వారా మనలో ఇవన్నీ ముద్రింప - బడుతాయి. మనము ఈ రంగుటద్దాల ద్వారానే విషయాలను చూస్తూ ఉంటాము , పనులను చేస్తూ ఉంటాము. వాటిని మంచి లేదా చెడుగా విభజిస్తాము. యోగం ఈ రంగులన్నింటినీ పోగొట్టి అన్ని విషయాలను స్పష్టంగా చూడగలిగేలా చేస్తుంది. ఇది రెమ్మలకు బదులుగా మూలాలను నాశనం చేయడం , మన స్వంత అభిప్రాయమును జోడించడానికి ప్రయత్నించకుండా పరిస్థితులను ఉన్నవి ఉన్నట్లుగా అంగీకరించడం వంటిది. ఈ విభజన తత్త్వముకారణంగా మనము పాక్షిక సమాచారమును మాత్రమే సేకరిస్తాము తద్వారా నిర్ణయాలు తీసుకోవడానికి అవసరమైన కీలకమైన సమాచారాన్ని కోల్పోతాము. తప్పుగా అన...