138. భ్రాంతులను అధిగమించడం
భగవద్గీతలోని ఏడవ అధ్యాయాన్ని ' జ్ఞాన-విజ్ఞాన-యోగము ' అని అంటారు . జ్ఞాన-విజ్ఞానాన్ని వ్యక్తమైన జగత్తు మరియు అవ్యక్తమైన పరమాత్మ యొక్క అవగాహనగా కూడా అర్థం చేసుకోవచ్చు. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు రెండు హామీలు ఇచ్చారు. మొదటిది , ఒకసారి ' ఇది ' తెలిసిన తర్వాత , తెలియడానికి ఏమీ మిగలదు (7.2). రెండవది , మరణించే సమయంలోనైనా ' ఇది ' అర్థం చేసుకుంటే , వారు నన్ను పొందుతారు (7.29). వ్యక్త రూపంలో ఉన్నది , నశించేది ఎనిమిది విధములుగా ఉంటుంది (7.4). అవ్యక్తమైన జీవన తత్త్వము ఇంద్రియాల సామర్ధ్యానికి అతీతమైనది. రత్నాల ఆభరణములో కట్టి ఉంచే సూత్రము లాగా వ్యక్త రూపంలో ఉన్న ప్రాణులకు అవసరమైన మద్దతునందిస్తుంది (7.7). వ్యక్తరూపంలో ఉన్నవన్నీ మూడు గుణాల ప్రభావంతో (7.25) , ఆసక్తి , విరక్తి వంటి పరస్పర భిన్న ధృవాలతో (7.27) ఏర్పడే భ్రాంతికి గురవుతాయి. ఇటుంటి భ్రాంతులనుండి విముక్తి చెందాలంటే మనిషి పరమాత్మ వద్ద ఆశ్రయం పొందాలి. సకల చరాచర విశ్వం (వ్యక్తమైనది) ఓక బిందువు నుండి మొదలైందని విజ్ఞాన శాస్త్రం నిర్ధారించింది. మనమంతా , మన చుట్టూ ఉన్న విశ్వమంతా ఆ మూల బిందువుతో అనుసంధానించబడి ఉంటుంది...