పోస్ట్‌లు

జులై, 2023లోని పోస్ట్‌లను చూపుతోంది

82. మనం విత్తినదే కోసుకుంటాము

చిత్రం
       “ పార్థా! భక్తులు నన్ను సేవించిన రీతికి అనుగుణంగా నేను వారిని అనుగ్రహింతును. మనుషులందరునూ వివిధ రీతులలో నా మార్గమునే అనుసరింతురు” అని శ్రీకృష్ణుడు చెబుతూ శక్తివంతమైన అవ్యక్తానికి , వస్తురూపం దాల్చిన వ్యక్తానికి మధ్య సంబంధం గురించి అంతర్దృష్టిని ఇస్తున్నారు ( 4.11). మనం ఏ మార్గాన్ని అనుసరించినా ఈ మార్గాలు ఎంత వైరుధ్యంగా కనిపించినా అవన్నీ అవ్యక్తమైన పరమాత్మను చేరుకునే మార్గాలేనని భగవంతుడు ఇచ్చిన హామీ. రెండవది , భగవంతుడు మన భావాలు , ఆలోచనలు , చర్యలను ప్రతిబింబించే , ప్రతిధ్వనించే బహుళ పరిమితుల అద్దం ( multi-dimensional mirror) లాంటివారు. మూడవది , మనం ఒక విత్తనాన్ని నాటినప్పుడు అది మొలకెత్తి ఒక చెట్టుగా పెరగడానికి సమయం పడుతుంది. ఈ సమయ జాప్యం వలన మనం పరమాత్మ యొక్క ప్రతిధ్వని సూత్రాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేకపోతాము. మనం మన జీవితాలను షరతులు లేని ప్రేమ , శ్రద్ధతో నింపుకుంటే ప్రేమ , శ్రద్ధ అనివార్యంగా తిరిగివచ్చి మన జీవితాలను ఆనందమయం చేస్తాయి. మనం కోపాన్ని , భయాన్ని , ద్వేషాన్ని , క్రూరత్వాన్ని లేదా అసూయను నాటితే అవే తిరిగి వ్యాపించి మన జీవితాలను దుర్భరం ...

81. శ్రీకృష్ణుని 'నేను' అనేది సమగ్రత

చిత్రం
        భగవద్గీతలో అర్జునుడు , శ్రీకృష్ణుడు ఇద్దరూ ' నేను ', అనే పదాన్ని ఉపయోగించారు కానీ అర్థం , సందర్భం భిన్నంగా ఉంటాయి. అర్జునుడి ' నేను ' అనేది అతని భౌతిక శరీరం , ఆస్తులు , భావాలు , నమ్మకాలను సూచిస్తుంది. అంతే కాకుండా అతని కుటుంబం , స్నేహితులు , బంధువులు కూడా ఇందులో మిళితమై ఉంటారు. మన స్థితి కూడా అర్జునుడి పరిస్థితి కంటే భిన్నముగా లేదు. మనం కొన్ని వస్తువులకు యజమానులము అని అనుకుంటాము , మరికొన్నింటికి యజమానులము కాము అని భావిస్తాము కానీ శ్రీకృష్ణుడు ' నేను ' అని ఉపయోగించి - నప్పుడు ఇది సమగ్రతను సూచిస్తుంది. మన ఇంద్రియాల పరిమితి కారణంగా మనం గ్రహించే విభిన్న ద్వంద్వాలు , వైరుధ్యాల వల్ల అన్నింటిలో మనం విభజనలను చూస్తాము కానీ శ్రీకృష్ణుని ' నేను ' ఈ విభజనల యొక్క సమ్మేళనమే. అదే పంథాలో కొనసాగుతూ మరొక చోట “నేను పుట్టుకతో పాటు మరణాన్ని కూడా” అని శ్రీకృష్ణుడు చెప్పారు. శ్రీకృష్ణుడు సముద్రమయితే మనం సముద్రంలో బిందువుల లాంటి వాళ్ళము. కానీ అహంకారం వలన మనకు స్వంత వ్యక్తిత్వము ఉందని అనుకుంటుంటాము. ఎప్పుడైతే ఆ బిందువు తన వ్యక్తిత్వ భ్రమను త్యజించి సముద్రంలో కలి...

80. మాయ యొక్క అభివ్యక్తి

చిత్రం
        తిరిగే చక్రానికి స్థిరమైన లేదా మార్పులేని ఇరుసు అవసరం అయినట్లే నిరంతరం మారుతూ , వ్యక్తమయ్యే భౌతిక ప్రపంచానికి కూడా తన ఉనికిని కొనసాగించడానికి ప్రశాంతమైన , స్థిరమైన , అవ్యక్తమైన కేంద్రము అవసరం. అర్జునుడు మనలాగే వ్యక్తీకరించబడిన మానవ శరీరం యొక్క స్థాయిలో ఉన్నాడు కనుక అతని బంధువుల మరణం గురించి చింతిస్తున్నాడు. వారు కేవలం వ్యక్తీకరించబడిన అస్తిత్వాలు. ప్రస్తుతం మానవ రూపంలో ఉన్న సర్వోన్నత ప్రభువైన శ్రీకృష్ణుడు అవ్యక్తం కొన్నిసార్లు ఏ విధముగా వ్యక్త రూపాన్ని ధరిస్తుందో వివరిస్తున్నారు. “నేను జన్మరాహితుడని , శాశ్వతుడను మరియు జీవులకు ప్రభువును. నా ప్రకృతిని అధీనంలో ఉంచుకుని , యోగమాయ ద్వారా నేను అవతారం ధరిస్తాను” అని శ్రీకృష్ణుడు చెప్పారు (4.6). అవ్యక్తమైనది ఒక విచారమనే మాయ ద్వారా వ్యక్తమౌతుంది. పరమాత్మ కూడా అలాగే అవతారం ధరిస్తారు. కానీ కోరికలు , కరుణ , స్పృహ స్థాయిలో తేడా ఉంటుంది. శ్రీకృష్ణుడు ఇంకా ఇలా అంటారు , “ ధర్మమునకు హాని కలిగినప్పుడును , అధర్మము పెచ్చుపెరిగిపోవు చున్నప్పుడును నన్ను నేను సృజించుకుందును. అనగా సాకార రూపముతో ఈ లోకమున అవతరింతును (4.7). సత్...

79. కాలాన్ని అధిగమించడం

చిత్రం
         భగవద్గీత అనేది రెండు స్థాయిల యొక్క పొందికైన సమ్మేళనము. భగవద్గీతను అర్థం చేసుకోవడానికి మనం ఈ స్థాయిల గురించి అవగాహన తెచ్చుకోవాలి. కొన్నిసార్లు శ్రీకృష్ణుడు మానవులు ఎదుర్కొంటున్న రోజువారీ సమస్యలను వివరిస్తూ అర్జునుడికి స్నేహితుడిగా లేదా మార్గదర్శిగా వస్తారు. కొన్నిసార్లు ఆయన పరమాత్మగా వచ్చి అస్తిత్వాన్ని గురించి వర్ణిస్తారు. అలా వివరిస్తూ ఆయన ' నేను వివస్వతునకు ఈ నాశనం లేని యోగాన్ని ఇచ్చాను ' అని అంటారు (4.1). ఇది రాజ ఋషులకు వారసత్వంగా అందించబడింది కానీ ఇది కాలక్రమేణా కోల్పోయింది అని చెప్పారు (4.2). ' వివస్వతుడు ' అంటే సూర్యభగవానుడని అర్ధం. ఆయన కాంతికి రూపకం. శ్రీకృష్ణుడు కాంతి కంటే ముందు తాను ఉన్నానని సూచిస్తున్నారు. ఈ విశ్వం కాంతితో ప్రారంభమై ఆ తర్వాత పదార్థం ఏర్పడిందని విజ్ఞాన శాస్త్రం కూడా అంగీకరిస్తుంది. శ్రీకృష్ణుడు రాజ ఋషులను ప్రస్తావిస్తున్నప్పుడు వారు వివిధ సమయాలలో జ్ఞానోదయం పొందినవారని అర్ధం చేసుకోవాలి. ఈ జ్ఞానం నేడు మాయమైపోయింది ఎందుకంటే కాలక్రమేణా అది అనుభవ స్థాయి నుండి కర్మకాండలు లేదా అనుష్టానాలకు పరిమితం అయ్యింది. తక్కువ అభ్యాసం , ఎ...

78. కోరికలకున్న శక్తి

చిత్రం
      కోరికలతో నిండి ఉన్న తులసీదాసు కు తన నూతన భార్యను కలవాలనే బలమైన కోరిక కలిగింది. అతను ఒక శవాన్ని చెక్కదుంగగా భావించి రాత్రి నదిని దాటాడు ; గోడపైకి ఎక్కడానికి పామును తాడుగా ఉపయోగించి భార్యను కలిశాడు. రక్తమాంసాలతో నిండిన నా శరీరంపై మీకున్న ప్రేమ ఒకవేళ రామనామంపై ఉన్నట్లయితే జీవితమనే నదిని ఎప్పుడో దాటి ఉండేవారని ఆయన భార్య అన్నది. అతను ఆ క్షణంలోనే పరివర్తన చెంది పరమపూజ్యమైన ‘ శ్రీ రామచరిత మానస్ ' కు రచయితగా మారాడు. ఇంద్రియాలను నియంత్రించడం ద్వారా కోరికలను నాశనం చేయాలనే శ్రీకృష్ణుడి సలహాని (3.41) బాగా అర్థం చేసుకోవడానికి తులసీదాసు కథ మనకు సహాయం చేస్తుంది. కోరికకు రెండు కోణాలు ఉంటాయి. మొదటిది మనలో ఉత్పన్నమయ్యే అభిరుచి , సంకల్పం , ధైర్యం అనే శక్తి. రెండవది దాని దిశ. ఈ శక్తి బాహ్యంగా నిర్దేశించబడి ఇంద్రియ సుఖాలు , ఆస్తులను కోరుకున్నప్పుడు వాటిని పొందే ప్రయత్నంలో అది వ్యర్దమవుతుంది. కోరికలను నాశనం చేయమని శ్రీకృష్ణుడు మనకు చెప్పినప్పుడు ఈ శక్తిని మనం నాశనం చేయకూడదని ; తులసీదాసు లాగా మనం అంతరాత్మను చేరుకునేందుకు అంతర్గత యాత్ర కొరకు ఉపయోగించాలని అర్థం. కక్ష్యను చేరుకోవడాన...

77. అద్దం లాంటి సాక్షి

చిత్రం
        “ పొగచే అగ్నియు , ధూళిచే అద్దము , మావిచే గర్భము కప్పివేయబడునట్లు , జ్ఞానము కామముచే ఆవృతమై యుండును ( 3.38). ఓ అర్జునా! కామము అగ్నితో సమానమైనది. అది ఎన్నటికిని చల్లారదు. జ్ఞానులకు అది నిత్యవైరి. అది మనుష్యుని జ్ఞానమును కప్పివేయు చుండును” అని శ్రీకృష్ణుడు కామము గురించి హెచ్చరించారు ( 3.39). గుణాలకు మనల్ని సమ్మోహితుల్ని చేసే సామర్థ్యం ఉందని ఇంతకు ముందు శ్రీకృష్ణుడు చెప్పారు. రజోగుణం నుండి పుట్టిన కోరిక కూడా అదే చేస్తుంది. “ఇంద్రియములు , మనస్సు , బుద్ధి ఈ కామమునకు నివాసస్థానములు. ఇది మనోబుద్దీంద్రియముల ద్వారా జ్ఞానమును కప్పివేసి , జీవాత్మను మోహితునిగా చేయును” అని శ్రీకృష్ణుడు బోధిస్తున్నారు ( 3.40). సాక్షి భావాన్ని అర్ధం చేసుకోవడానికి అద్దం సరైన ఉదాహరణ. ఎటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేయకుండా తన ముందుకు తీసుకువచ్చిన పరిస్థితులను , వ్యక్తులను ప్రతిబింబించడమే దీని సామర్ధ్యము , జ్ఞానం. ఇది గతం యొక్క భారాన్ని మొయ్యదు లేదా భవిష్యత్తు నుండి ఎటువంటి అపేక్షలు కలిగి ఉండదు. అద్దం ఎల్లప్పుడూ వర్తమానంలో ఉంటుంది. ధూళితో కప్పబడినప్పుడు మాత్రం దాని సామర్థ్యము తగ్గుతుంది. ...