పోస్ట్‌లు

సెప్టెంబర్, 2022లోని పోస్ట్‌లను చూపుతోంది

20. మరణం మనల్ని చంపలేదు

చిత్రం
శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇలా చెప్తారు “నీవు గాని , నేను గాని , ఈ రాజులు గానీ ఉండని కాలమే లేదు. ఇక ముందు కూడా మనము ఉండము అన్న మాటే లేదు” (2.12). నాశనంలేని శాశ్వతమైన ' జీవన తత్త్వము ' యొక్క ' భౌతిక భాగం ' నశించడం ఖాయమని , అందువల్ల ముందున్న యుద్ధాన్ని కొనసాగించవలసినదని ఆయన అన్నారు. శాశ్వతమైన ' జీవన తత్వాన్ని ' ఆత్మ , చైతన్యం , అవగాహన అన్న పేర్లతో పిలుస్తాము. శ్రీకృష్ణుడు దీనినే ' దేహి ' అంటారు.      శ్రీకృష్ణుడు ఈ సృష్టి యొక్క సారమును వివరిస్తూ శాశ్వతమైన , అపరిమితమైన ' జీవన తత్వము ' గురించి చెప్పడం మొదలు పెడతారు. ఈ శాశ్వతమైన అస్తిత్వానికి ఒక భౌతిక భాగం ఉంది. ఇది కాలక్రమములో తప్పనిసరిగా నాశనం అవుతుందని అంటారు. శ్రీకృష్ణుడు పాలకుల గురించి మాట్లాడినప్పుడు ఆయన వారిలోని ఉన్న శాశ్వతమైన , నాశనము లేని ' జీవన తత్వము ' గురించి ప్రస్తావిస్తున్నారు. గమనించదగ్గ విషయం ఏమిటంటే , మనందరమూ రెండు భాగాలతో నిర్మించబడ్డాము. మొదటి భాగము దేహము , మనస్సు - ఈ రెండూ తప్పనిసరిగా నాశనమయ్యేవి. ఇవి సుఖదుఃఖాల వంటి ద్వంద్వాలకు లోనవుతాయి. ప్రస్తుత క్షణంలో అర్జునుడు అట...

19. సృజనాత్మకత సృష్టిస్తుంది

చిత్రం
' సత్యము ' ( వాస్తవమైనది , శాశ్వతమైనది) మరియు ' అసత్యము ' ( అవాస్తవమైనది , అశాశ్వతమైనది) గురించి మరింతగా వివరిస్తూ శ్రీకృష్ణుడు నాశనం లేనిది , అన్నింటా వ్యాపించి ఉన్న ' దాన్ని ' గురించి మనలను ఆలోచించమంటారు ( 2.17). ఈ సృష్టి యావత్తు సృష్టికర్త పని అనే సులభమైన అవగాహన కలిగి ఉండటం చాలా సహజం. కానీ శ్రీకృష్ణుడు నిరంతర పరిణామ శక్తి అయిన ' సృజనాత్మకత ' దిశగా దృష్టి మల్లించాలని సూచిస్తున్నారు. ఉదాహరణకు ' సృజనాత్మకత ' విత్తనాలను మొలకెత్తేలా చేస్తుంది. మొలకను , విత్తనాన్ని నాశనం చేయొచ్చు . కానీ నిరంతరం పని చేస్తూ ఉండేది , సర్వత్రా వ్యాపించి ఉన్న ' సృజనాత్మకత ' నాశనము చేయబడదు. సృష్టికి కాలపరిమితి ఉంటుంది కానీ ' సృజనాత్మకత ' కాలాతీతమైనది. భౌతిక స్వరూపాలు పుడుతూ ఉంటాయి , మరణం తర్వాత తమ ఉనికిని కోల్పోతాయి. కానీ ' సృజనాత్మకత ' నాశనం లేనిది. ' సృజనాత్మకత ' అనేదే నిజమైన కర్త. ఇది భావనలను , ఉద్వేగాలను సృష్టిస్తుంది. మన దేహం , మనస్సు వంటి భౌతిక స్వరూపాలను సృష్టిస్తుంది. జ్ఞానము , జ్ఞాపకశక్తి అనేవి గతానికి సంబంధించినవి , కర్మఫలమ...

18. సత్యము, అసత్యము

చిత్రం
' సత్యము ' ( వాస్తవమైనది , శాశ్వతమైనది) నశించదని , ' అసత్యము ' ( అవాస్తవమైనది , అశాశ్వతమైనది) కు ఎన్నడూ ఉనికి లేదని శ్రీకృష్ణుడు చెబుతారు. జ్ఞాని మాత్రమే ఈ రెండింటి మధ్య తేడాని గమనించగలరు ( 2.16). ' సత్యము ', ' అసత్యము ' యొక్క చిక్కుముడులను అర్థం చేసుకోవడానికి అనేక సంస్కృతులలో తాడు , పాముల యొక్క భ్రాంతికి సంబంధించిన కథ ఉదహరించబడుతుంది. సంధ్యవేళ ఒక మనిషి ఇంటికి చేరుకొని గుమ్మంలో ఒక పాము లాగా చుట్టుకుని ఉన్న వస్తువును చూస్తాడు. నిజానికి అది పిల్లలు వదిలివేసిన తాడు ; మసకగా ఉండడం వల్ల పాములా కనిపించింది. ఇక్కడ తాడు ' సత్యము ' ను , పాము ' అసత్యము ' ను సూచిస్తుంది. అతడు ' సత్యము ' ను అంటే తాడును గుర్తించే వరకూ తాను ఊహించుకున్న ' అసత్యము ' అంటే పాముని ఎదుర్కోడానికి అనేక వ్యూహాలను వేచే అవకాశం ఉంది. అతడు దానిపై కర్రతో దాడి చేయవచ్చు లేదా పారిపోవచ్చు లేదా నిజాన్ని తెలుసుకోవడానికి ఒక దీపాన్ని/టార్చ్ ను వెలిగించవచ్చు. మన అవగాహన అసత్యము మీద ఆధారపడినప్పుడు అత్యుత్తమమైన వ్యూహాలు , నైపుణ్యాలు కూడా నిష్ఫలం అవుతాయి. ఇక్కడ ' తాడు ...

17. నాలుగు రకాల భక్తులు

చిత్రం
శ్రీకృష్ణుడు నాలుగు రకాల భక్తులు ఉంటారని అంటారు. మొదటిరకం వారు , జీవితంలో వారు ఎదుర్కొంటున్న కష్టాలు , దుఃఖం నుంచి బయటపడాలని కోరుకుంటారు. రెండవవారు భౌతిక ఆస్తులు , ప్రాపంచిక సుఖాలను పొందాలని కోరుకుంటారు. చాలా మంది భక్తులు ఈ రెండు వర్గాలకు చెందుతారు. ఈ రెండు రకాల భక్తులూ వివిధ దేవతలను ప్రార్ధిస్తూ అనేక రకాల పూజలు , ప్రార్ధనలను చేస్తూ ఉంటారని శ్రీకృష్ణుడు చెప్తారు. రోగాన్ని బట్టి సంబంధిత వైద్యుడిని సంప్రదించడం వంటిదే ఇది. వారికి ఉన్న శ్రద్ధ వలన ఇటువంటి భక్తుల కోరికలు తీరతాయని శ్రీకృష్ణుడు అంటారు. ఇది సంక్షిప్తంగా ఒక రకమైన శరణాగతి. దిగువ ఉదాహరణ శ్రద్ధను గురించి చెబుతుంది. ప్రక్క ప్రక్కన పొలాలు ఉన్న ఇద్దరు రైతులు సాగు కోసం ఒక బావిని తవ్వాలని నిర్ణయించుకుంటారు. మొదటి రైతు ఒకటి రెండు రోజులు ఒక చోట తవ్వి నీరు పడకపోవడంతో మరొక ప్రదేశంలో కొత్తగా తవ్వడం మొదలు పెడతాడు. రెండవ రైతు ఒకే ప్రదేశంలో తవ్వుతూ పోతాడు. ఒక నెల గడిచేసరికి మొదటి రైతు పొలమంతా గోతులతో నిండిపోయింది. రెండవ రైతు తన బావిలో నీటిని పొందుతాడు. మన ఇంద్రియాలకు ఏమీ కనిపించకపోయినా (ఈ ఉదాహరణలో నీరు) , మనలో ఉన్న శ్రద్ధ మనకు దారి చూపిస...

16. గుణాతీతులవడం

చిత్రం
ఏ కర్మకూ కర్త ఉండడని శ్రీకృష్ణుడు అంటారు. నిజానికి కర్మ అనేది ప్రకృతిలోని భాగాలైన సత్వ , రజో , తమో గుణాల మధ్య జరిగే పరస్పర ప్రభావాల పరిణామమే. దుఃఖాల నుంచి విముక్తి పొందాలంటే ఈ గుణాలను అధిగమించమని శ్రీకృష్ణుడు అర్జునుడికి సలహా ఇస్తారు. గుణాతీతునిగా అవ్వడం (గుణాలను అధిగమించడం) ఎలాగో , అటువంటి దశను పొందిన వ్యక్తి ఎలా ఉంటారో తెలుసుకోవాలని అర్జునుడు ఆశిస్తాడు. దంద్వాతీత (ధృవాలను అధిగమించడం) , ద్రష్ట (సాక్షి) , సమత్వం (సమానత్వం) అనే భగవద్గీతలో నిక్షిప్తమైన లక్షణాల గురించి ఇంతకుముందే వర్ణింపబడినది. ఈ మూడింటి సంయోగమే గుణాతీత అని శ్రీకృష్ణుడు సూచించారు. శ్రీకృష్ణుడి ప్రకారం గుణాతీత స్థితిని చేరుకున్న వ్యక్తి గుణాలే గుణాలతో ప్రతిస్పందిస్తున్నాయని తెలుసుకుంటాడు కనుక సాక్షిగా ఉంటాడు. అటువంటి స్థితిలో ఏ ఒక గుణం పట్ల ప్రత్యేక ఆకర్షణ కలిగి ఉండడు. మరో గుణం పట్ల విముఖత చూపడు. గుణాతీతుడైన వ్యక్తి ద్వంద్వాతీతుడు కూడా అయి ఉంటాడు. కష్టసుఖాల యొక్క ధృవాలను అర్థం చేసుకున్నాక అతను రెండిటి పట్ల తటస్థంగా ఉంటాడు. అతడు మిత్రుల పట్ల , శత్రువుల పట్ల తటస్థంగా ఉంటాడు ఎందుకంటే అతనికి మనకు మనమే మిత్రులమని మనకు ...

15. సమత్వం

చిత్రం
సమత్వం (సమానత్వం) అనేది భగవద్గీతలో అనేకచోట్ల కనిపించే కీలకమైన అంశం. శ్రీకృష్ణ భగవానుడు సమత్వ భావనను , సమత్వ దృష్టిని , సమత్వ బుద్ధిని అనేక చోట్ల ప్రస్తావిస్తారు. సమత్వాన్ని అర్థం చేసుకోవడం సులభం కానీ అంతర్లీనము చేసికొని ఆచరణలో పెట్టడం అనేది కష్టమైన విషయం. ఒక్క మాటలో చెప్పాలంటే మనలోని సమత్వం యొక్క స్థాయి ఆధ్యాత్మిక ప్రయాణంలో మనం సాధించే పురోగతికి సూచిక. ఆధునిక సమాజాలు సమత్వాన్ని పౌరులందరూ చట్టం ముందు సమానమే అని అంగీకరించాయి. జ్ఞాని వేట జంతువూను వేటగాడిని ; బాధని సంతోషాన్ని ; లాభాన్ని నష్టాన్ని సమానంగా చూస్తాడంటూ శ్రీకృష్ణుడు సమత్వానికి అనేక ఉదాహరణలు ఇస్తారు. మన పెంపకం వలన , సమాజం వలన ధర్మం , కులము , మతము , జాతి , వర్గం వంటి అనేక కృత్రిమమైన విభజనలకు మనం లోనవుతాము. ఈ విభజనలన్నింటినీ అధిగమించి ఇద్దరు మనుషుల్ని సమానంగా చూడడమే సమత్వం వైపు తొలి అడుగు. ఇది బాహ్య ప్రవర్తన కన్నా చాలా లోతైనది. సమత్వం వైపు పురోగతిలో తదుపరి స్థాయి మనకు దగ్గరగా ఉన్న ఇద్దరు వ్యక్తులను సమత్వ దృష్టి , భావంతో చూడడం. ఇందుకు ఉదాహరణలు మన పిల్లలు అంతగా రాణించని సందర్భాల్లో మన మిత్రుల పిల్లలు రాణిస్తూ ఉంటే సంతోషించగలగ...

14. సత్వ, తమో, రజో గుణాలు

చిత్రం
మనలో చాలామంది మన చర్యలన్నిటికీ మనమే కారణం అని , మన విధిని మనమే నిర్ణయిస్తామని నమ్ముతాము. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు గుణాల మధ్య పరస్పర చర్యలే కర్మలను సృష్టిస్తాయని అంతేగానీ కర్త వల్ల కాదని బోధిస్తున్నారు. ప్రకృతి నుంచి మూడు గుణాలు పుట్టి ఆత్మను భౌతిక దేహంతో బంధిస్తాయి. ఈ సత్వ , రజో , తమో గుణాలు మనలో ప్రతి ఒక్కరిలో వివిధ పాళ్లలో ఉంటాయి. సత్వగుణం జ్ఞానంతో , రజోగుణం కోరికలతో , తమోగుణం అలసత్వంతో సంబంధాన్ని కలిగి ఉంటాయి. ' ఎలక్ట్రాన్లు ', ' ప్రోటాన్లు ', ' న్యూట్రాన్ల ' ల కలయిక వలన విస్తృతమైన లక్షణాలు గల అనేక వస్తువులు ఉత్పన్నమైనట్లే , ఈ మూడు గుణాల యొక్క కలయికే మన స్వభావానికి , కర్మలకు కారణం. నిజానికి , వ్యక్తుల మధ్య జరిగే పరస్పర చర్యలు , సంభాషణలు వారి యొక్క గుణాలు మధ్య జరిగే పరస్పర ప్రక్రియ తప్ప మరేమీ కాదు. విద్యుదయస్కాంత క్షేత్రంలో ఉంచిన అయస్కాంత ద్విధృవం ( dipole) ఆ క్షేత్రం ప్రకారం తిరుగుతుంది. వస్తువులు గురుత్వాకర్షణ శక్తి వల్ల ఆకర్షింపబడతాయి. ఇటువంటి అనేక భౌతిక , రసాయనిక లక్షణాలు ఉన్నాయి. అలాగే కర్మ కూడా కర్త వల్ల కాక గుణాల యొక్క కలయిక వల్ల జరుగుతుంది. భ...

13. సాక్షి అవడం

చిత్రం
భగవద్గీతని ఒక్క పదంలో వివరించాలంటే ' ద్రష్ట ' ( సాక్షి) అని చెప్పవచ్చు . ఈ వివరణ అనేక సందర్భాలలో మనకు కనిపిస్తుంది. మనలో చాలామంది అన్ని పనులను మనమే చేస్తామని , పరిస్థితులను నియంత్రిస్తామని అనుకుంటూ ఉంటాము కనుక నిజాన్ని అర్థం చేసుకోవడం ఎంతో అవసరం. కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుడి వయసు 60 సంవత్సరాలు. అప్పటికే అతడు మంచి జీవితాన్ని గడిపి అన్ని రకాల విలాసాలను అనుభవించాడు. ఒక యోధుడిగా అతడు యుద్ధ క్షేత్రంలో అనేక సార్లు విజయాన్ని చవి చూశాడు. కురుక్షేత్ర యుద్ధ సమయంలో అతడు తానే కర్తనని (అహం కర్త - అహంకారం-అహంకారి) , తన బంధుమిత్రుల చావుకు తానే కారకుడు అవుతాడని భావించడం వలన యుద్ధ క్షేత్రంలో విషాదానికి లోనయ్యాడు. అతడు ' కర్త ' కాదని , శ్రీకృష్ణ భగవానుడు అతనితో చెప్పే ప్రయత్నమే భగవద్గీత. ' ఒకవేళ నేను కర్తను కాకపోతే మరి ఏమిటి ? ' అనేది సహజ ప్రశ్న. భగవానుడు భగవద్గీతలో అర్జునుడికి అతను ‘ కర్త ’ కాదు ‘ సాక్షి ’ అని చెబుతారు. 60 ఏళ్ల జీవితంలోని మంచి , చెడు అనుభవాల వల్ల అర్జునుడు తాను కేవలం ఒక ' సాక్షి ' ని మాత్రమే కానీ ' కర్త ' ను కాదు అన్న భావనను గ్రహించుక...