20. మరణం మనల్ని చంపలేదు
శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇలా చెప్తారు “నీవు గాని , నేను గాని , ఈ రాజులు గానీ ఉండని కాలమే లేదు. ఇక ముందు కూడా మనము ఉండము అన్న మాటే లేదు” (2.12). నాశనంలేని శాశ్వతమైన ' జీవన తత్త్వము ' యొక్క ' భౌతిక భాగం ' నశించడం ఖాయమని , అందువల్ల ముందున్న యుద్ధాన్ని కొనసాగించవలసినదని ఆయన అన్నారు. శాశ్వతమైన ' జీవన తత్వాన్ని ' ఆత్మ , చైతన్యం , అవగాహన అన్న పేర్లతో పిలుస్తాము. శ్రీకృష్ణుడు దీనినే ' దేహి ' అంటారు. శ్రీకృష్ణుడు ఈ సృష్టి యొక్క సారమును వివరిస్తూ శాశ్వతమైన , అపరిమితమైన ' జీవన తత్వము ' గురించి చెప్పడం మొదలు పెడతారు. ఈ శాశ్వతమైన అస్తిత్వానికి ఒక భౌతిక భాగం ఉంది. ఇది కాలక్రమములో తప్పనిసరిగా నాశనం అవుతుందని అంటారు. శ్రీకృష్ణుడు పాలకుల గురించి మాట్లాడినప్పుడు ఆయన వారిలోని ఉన్న శాశ్వతమైన , నాశనము లేని ' జీవన తత్వము ' గురించి ప్రస్తావిస్తున్నారు. గమనించదగ్గ విషయం ఏమిటంటే , మనందరమూ రెండు భాగాలతో నిర్మించబడ్డాము. మొదటి భాగము దేహము , మనస్సు - ఈ రెండూ తప్పనిసరిగా నాశనమయ్యేవి. ఇవి సుఖదుఃఖాల వంటి ద్వంద్వాలకు లోనవుతాయి. ప్రస్తుత క్షణంలో అర్జునుడు అట...