34. కర్మ పై దృష్టి కర్మఫలంపై కాదు.
“మనకు కర్మ చేసే అధికారం ఉంది కానీ కర్మఫలం పై
అధికారం లేదని”, భగవద్గీతలోని ప్రఖ్యాతమైన శ్లోకం 2.47 లో శ్రీకృష్ణుడు చెప్పారు. కర్మఫలం మన కర్మలకు ప్రేరణగా ఉండకూడదని,
అదే సమయంలో మనం అకర్మ వైపు మొగ్గకూడదని కూడా ఆయన చెప్పారు.
జీవితంలోని వివిధ కోణాలను, అనుభవాలను ఈ శ్లోకములో చూస్తాము
కనుక ఇది భగవద్గీతయందు ఎక్కువగా ప్రస్తావించబడే శ్లోకం.
శ్రీకృష్ణుడు శ్రద్ధ అద్భుతాలు చేస్తుందని హామీ
ఇస్తారు (7.21-7.22). ఈ శ్లోకాన్ని సంగ్రహించడానికి
శ్రీకృష్ణుడి మీదే శ్రద్ధ పెట్టి తర్కంలోకి వెళ్లకుండా, దానిని
విశ్లేషించడానికి ప్రయత్నించకుండా ఈ బోధనను అమలు చేయడం ప్రారంభించడమే సులభమైన
విధానం. ఈ శ్లోకాన్ని ఆచరణలోకి తీసుకురావడం ద్వారా కర్మయోగం యొక్క పరాకాష్టకు మనము
చేరుకొనగలము.
మన కర్మల యొక్క కర్మఫలంపై దృష్టి కేంద్రీకరించడం
వలన మనం కర్మమీద ధ్యాస కోల్పోయేలా చేస్తుంది. దాని ఫలితంగా కర్మఫలం అందకుండా
పోతుంది. ఒక విద్యార్థి చేత పేలవంగా చేయబడిన కర్మ (అధ్యయనం) ఎప్పటికీ కోరుకున్న
కర్మఫలం (పరీక్షా ఫలితాలు) ఇవ్వదు. మనకు ఎదురయ్యే ఏ పరిస్థితిలోనైనా మనకు సాధ్యమైన
కృషి చేయడంపై మాత్రమే ధ్యాస పెట్టాలని శ్రీకృష్ణుడు చెప్పారు.
మూడవది, కర్మ ప్రస్తుత
క్షణంలో జరుగుతుంది కానీ కర్మఫలం ఎల్లప్పుడూ భవిష్యత్తులో ఉంటుంది. కర్మఫలం అనేది
అనేక సంభావనల కలయిక. మనకు వర్తమానంపై మాత్రమే నియంత్రణ ఉంటుంది కానీ భవిష్యత్తు
లేదా గతంపై నియంత్రణ ఉండదు కాబట్టి ఎల్లప్పుడూ ప్రస్తుత క్షణంలోని పనిపై పూర్తీ
ధ్యాస పెట్టాలని శ్రీకృష్ణుడు సలహా ఇస్తున్నారు.
దృష్టికోణం లేదా అవగాహన ఏదైనాగాని ఎప్పుడూ
ఆగిపోనీ సుఖ-దుఃఖ ధ్రువ తరంగాలను అధిగమించడానికి సహాయం చేయడం ద్వారా మనలో సమానత్వం
తీసుకురాగల సామర్థ్యం ఈ శ్లోకానికి ఉంది.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి